DNB News - ఆంధ్రప్రదేశ్ / : లోద్దల కాగితపల్లి గ్రామంలో భూమి యాజమాన్య హక్కుపత్రం– రాజ ముద్ర తో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆముదాలవలస నియోజకవర్గంలోని సరుబుజ్జిలి మండలం లోద్దల కాగితపల్లి గ్రామంలో భూమి యాజమాన్యపు హక్కులు కల్పిస్తూ పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసే కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఆముదాలవలస గౌరవ శాసనసభ్యులు మరియు రాష్ట్ర పియుసి చైర్మన్ శ్రీ కూన రవికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని అర్హులైన రైతులకు భూమి యాజమాన్యపు హక్కు పత్రాలు, పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూన రవికుమార్ గారు మాట్లాడుతూ, రైతుకు భూమిపై స్పష్టమైన హక్కు కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని అన్నారు. భూమి సంబంధిత సమస్యల వల్ల సంవత్సరాల తరబడి రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులకు ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు శాశ్వత పరిష్కారం అవుతాయని స్పష్టం చేశారు. రైతు చేతిలో పాస్ పుస్తకం ఉంటే బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పథకాలు సులభంగా అందుబాటులోకి వస్తాయని తెలిపారు. గత వైకాపా ప్రభుత్వoలో భూ సర్వే సరిగ్గా జరగకపోవడం వలన భూ వివాదాలు, రికార్డుల లోపాల వల్ల అనేక మంది రైతులు నష్టపోయారని, వాటిని సరిదిద్దే దిశగా కూటమి ప్రభుత్వం పారదర్శకంగా చర్యలు తీసుకుంటోందని చెప్పారు. భూమి హక్కులు కేవలం పత్రాలు కాదు – రైతుకు భరోసా, భవిష్యత్తుకు భద్రత అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ శివాల సూర్యం మండల అధ్యక్షులు అంబాలా రాంబాబు స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు కార్యకర్తలు,రెవెన్యూ అధికారులు, గ్రామ పెద్దలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పట్టాదారు పాస్ పుస్తకాలు అందుకున్న రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ, తమ భూమిపై స్పష్టమైన హక్కులు కల్పించినందుకు ఎమ్మెల్యే కూన రవికుమార్ ప్రభుత్వంకు కృతజ్ఞతలు తెలిపారు.
Admin
DNB News