DNB News - ఆంధ్రప్రదేశ్ / : డ్రోన్ సిటీ ఏర్పాటు కి సంబంధించి చేపడుతున్న పనులలో పురోగతి తీసుకొని రావాలని ఇంచార్జి కలెక్టర్ నూరుల్ ఖమర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఓర్వకల్లు మండలం చింతలపల్లి గ్రామంలో చేపడుతున్న డ్రోన్ సిటీ నిర్మాణం పనులను ఇంచార్జి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ అధికారులతో కలిసి భూసేకరణ ప్రక్రియ, మౌలిక సదుపాయాలైన రోడ్లు, విద్యుత్, మరియు నీటి సరఫరా పనుల పురోగతిని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. డ్రోన్ తయారీ, టెస్టింగ్, మరియు పరిశోధనలకు అవసరమైన మౌలిక వసతులను వేగంగా పూర్తి చేయాలని ఇంచార్జి కలెక్టర్ అధికారులను ఆదేశించారు. భూ సమస్యలు తలెత్తకుండా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో ఓర్వకల్లు తహసిల్దార్ విద్యా సాగర్, ఏపీఐఐసీ డిఈ సందీప్ తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News