DNB News - ఆంధ్రప్రదేశ్ / : ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ (WAM) 2026-27 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర (దక్షిణ విభాగం) ప్రధాన కార్యదర్శిగా ఆదోని పట్టణానికి చెందిన వంకదారు శ్రీనాథ్ గుప్తాను నియమిస్తూ వామ్ గ్లోబల్ ప్రెసిడెంట్ శ్రీ టంగుటూరి రామకృష్ణ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఇదివరకు ఆదోని పట్టణ అధ్యక్షుడిగా సేవలందించిన శ్రీనాథ్ గుప్తా, సామాజిక సేవలో విశేషంగా గుర్తింపు పొందారు. ఉచిత మెడికల్ క్యాంపులు, చలివేంద్రాలు, స్వర్ణామృత ప్రాసన ఔషధ పంపిణీ వంటి అనేక ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహించినందుకు గుర్తింపుగా ఆయనకు రాష్ట్ర స్థాయి బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనాథ్ గుప్తా మాట్లాడుతూ, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ద్వారా దేశ, విదేశాలలో మరింత సేవా కార్యక్రమాలు విస్తరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. తనను ఈ పదవికి ఎంపిక చేసిన వామ్ గ్లోబల్ ప్రెసిడెంట్ శ్రీ టంగుటూరి రామకృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే వామ్ గ్లోబల్ చైర్మన్ టీజీ వెంకటేష్కు నమస్కారాలు తెలియజేశారు. వామ్ నాయకులు శ్రీమతి జ్యోతి, శ్రీమతి జయశ్రీ, దిలీప్, సుబ్బరాజు, శ్రీమతి సూరా శ్రీదేవి తదితరులకు, అలాగే ఆదోని టీమ్ సభ్యులకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర స్థాయి పదవికి నియామకం పొందిన శ్రీనాథ్ గుప్తాకు పలు పట్టణాల ఆర్యవైశ్య సంఘాలు, బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు శుభాకాంక్షలు తెలిపారు.
Admin
DNB News