Wednesday, 17 June 2026 05:16:39 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

పుకార్లతో పెట్రోల్ కలకలం – బ్లాక్ మార్కెట్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోండి: నూర్ అహ్మద్ డిమాండ్

Date : 29 April 2026 11:44 AM Views : 45

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందని సోషల్ మీడియా మరియు కొన్ని పత్రికల్లో జరుగుతున్న ప్రచారం పూర్తిగా తప్పుడు దుష్ప్రచారమని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి (MHPS) రాష్ట్ర కార్యదర్శి ఆలూరు నూర్ అహ్మద్ తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాలుచేయాలనే ఉద్దేశంతో కొందరు వ్యక్తులు కావాలనే పుకార్లు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఈ తప్పుడు ప్రచారం వల్ల ప్రజలు భయాందోళనలకు గురై అవసరానికి మించి ఇంధనం కొనుగోలు చేస్తున్నారని, దీన్ని అవకాశంగా తీసుకుని కొందరు వేలాది లీటర్ల పెట్రోల్, డీజిల్ నిల్వ చేసి బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఫలితంగా సాధారణ ప్రజలకు ఇంధనం అందక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పక్క రాష్ట్రం కర్ణాటకలో పెట్రోల్, డీజిల్ సమృద్ధిగా లభిస్తున్నదని పేర్కొంటూ, అసలు కొరత ఎక్కడా లేదని, ఇది పూర్తిగా ప్రభుత్వానికి మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి చెడ్డపేరు తెచ్చేందుకు చేస్తున్న కుట్రేనని అన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడుతున్న వారిపై కార్డన్ సెర్చ్‌లు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే సోషల్ మీడియా వేదికలలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని నూర్ అహ్మద్ డిమాండ్ చేశారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :