DNB News - ఆంధ్రప్రదేశ్ / : తిరుమల తిరుపతి దేవస్థానం లో గత ప్రభుత్వ హయంలో శ్రీవారి లడ్డు తయారీలో నెయ్యకు బదులు రసాయానాలతో కూడిన సింథటిక్ కలిగిన నెయ్యి తయారుచేసి కల్తీ లడ్డూలను తయారు చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వైసీపీ నాయకులు వ్యవహరించిన తీరును ఖండిస్తూ జనసేన పార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ గారితో కలిసి ఆమదాలవలస నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి పేడాడ రామ్మోహన్ రావు గారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన టీటీడీ స్వామివారి లడ్డుప్రసాదం కల్తీ చేసి, అక్రమ సంపాదన లక్ష్యంగా, హిందువుల పవిత్రతను దెబ్బతీసే విధంగా రసాయనంతో కూడిన నెయ్యి సరఫరా చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల సిట్ దర్యాప్తులో లడ్డు తయారీలో పూర్తిగా నెయ్యిని వినియోగించలేదని కుండబద్దలు కొట్టినట్టు చెబుతున్నప్పటికీ, వైసీపీ శ్రేణులు దీన్ని తప్పుదోవ పట్టించేందుకు రాష్ట్రంలో అనేక అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతూ, కుల, మత పరమైన విద్వేషాలను కలిగిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని వాపోయారు. గత ప్రభుత్వంలో ప్రభుత్వ పేదలకు చేసిన పాపాలకు ఫలితంగా 150 యొక్క సీట్ల నుండి 11 సీట్లకు దిగజారి పోయారని అన్నారు. రాష్ట్రంలో వైసిపి చేస్తున్న దిగజారుడు రాజకీయాలను ప్రజలంతా గమనిస్తున్నారని, దేవుడు క్షమించినా ప్రజలు క్షమించరని రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని తెలిపారు.ఈ కార్యక్రమంలో టెక్కలి ఇంచార్జ్ కణితి కిరణ్ కుమార్, నరసన్నపేట ఇంచార్జ్ బలగ ప్రవీణ్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు పాత్రుని పాపారావు, భూపతి అర్జున్ తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News