DNB News - ఆంధ్రప్రదేశ్ / : పట్టణంలోని మున్సిపల్ హైస్కూల్లో SFI, UTF ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన 10వ తరగతి మోడల్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గురువారం అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బాలాజీ జోతిర్మయ్ కళాశాల కరస్పాండెంట్ మురళీ బాబు, సాష ఆసుపత్రి నర్సింగ్ హోమ్ డాక్టర్ కిరణ్ కుమార్, యూటీఎఫ్ జిల్లా నాయకులు సునీల్ రాజ్, మున్సిపల్ పాఠశాల ఇంచార్జ్ హెచ్ఎం సుధాకర్, మాజీ DYFI నాయకులు లక్ష్మన్న, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాసులు, సంయుక్త, పట్టణ కార్యదర్శి శశిధర్ పాల్గొన్నారు. టౌన్ స్థాయిలో ఫస్ట్, సెకండ్, థర్డ్ స్థానాలు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవ తరగతి ఉత్తీర్ణత ఉన్నత విద్యకు తొలిమెట్టు లాంటిదని, ప్రణాళికాబద్ధంగా పరీక్షలకు సిద్ధమై ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు. మోడల్ టెస్ట్ పరీక్షలు విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమని, పబ్లిక్ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించడానికి ఇవి దోహదపడతాయని తెలిపారు. పరీక్షల సమయంలో సమయ నిర్వహణ, ప్రశ్నాపత్రం పూర్తిగా చదవడం, ఆత్మవిశ్వాసంతో సమాధానాలు రాయడం వంటి జాగ్రత్తలను పాటించాలని విద్యార్థులకు సూచించారు. రాబోయే పబ్లిక్ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని క్రమశిక్షణతో చదివి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.
Admin
DNB News