DNB News - ఆంధ్రప్రదేశ్ / : టి డి పి రాష్ట్ర అధ్యక్షులుగా రెండవసారి నియమితులైన ఎమ్మెల్యేపల్లా శ్రీనివాసరావు ని ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ జిల్లా నాయకులు బొండా యల్లాజీరావు, శ్రీదేవి లు ******************టి డి పి రాష్ట్ర అధ్యక్షులుగా రెండవసారి కూడా నియమితులైన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ని గాజువాక క్యాంపు ఆఫీస్ లో బీజేపీ జిల్లా సీనియర్ నాయకులు మరియు రాయలచెరువు రాయల్స్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బొండా యల్లాజీరావు, శ్రీదేవి ల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్బంగా యల్లాజీరావు మాట్లాడుతూ ఎమ్మెల్యే గారికి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారని అందరం ఆశించామని, అంతకు మించి దేశంలోనే అత్యంత బలమైన పార్టీ టి డి పి కి అధ్యక్షులుగా చేసి ఈయన నాయకత్వ పటిమకు తగిన గుర్తింపు నిచ్చారని అన్నారు. కూటమి ప్రభుత్వం పదికాలాల పాటు అధికారంలో ఉండి అటు విశ్వ గురువు నరేంద్రుని నాయకత్వంలో భారతదేశం వికసించాలని, ఇటు మోదీజీ,చంద్రబాబు, పవన్, పల్లా, మాధవ్ నాయకత్వంలో అమరావతి అభివృద్ధి చెంది దేశంలోనే అత్యంత ప్రాధాన్యత గల్గిన రాష్ట్రముగా అవతరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ యువ మోర్చా నాయకులు సేనాపతి రాజేష్, ఓబీసీ మోర్చా జిల్లా నాయకులు ఎస్ నూకరాజు,వడ్లపూడి మండల ఉపాధ్యక్షులు సేనాపతి వెంకటలక్ష్మి,మండల ప్రధాన కార్యదర్శి మోటూరు బాబురావు, జిల్లా ఓ బి సి మోర్చా నాయకులు మళ్ల దిలీప్ కుమార్ అసోసియేషన్ నుండి కూటికుప్పల జనార్ధనరావు. ములికి లోవబాబు, గొన్న రమణ రావు, వెంకటేశ్వరరావు, పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు
Admin
DNB News