DNB News - ఆంధ్రప్రదేశ్ / : గోనెగండ్ల మండలానికి చెందిన సమగ్ర శిక్షలో మండల స్థాయి అకౌంటెంట్ (అవుట్ సోర్సింగ్) గా పనిచేస్తున్న శ్రీనివాసులు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన నేపథ్యంలో ప్రభుత్వం మంజూరు చేసిన రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా చెక్కును జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి ఆయన భార్య మంజులకు అందజేశారు. కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ చెక్కును అందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. శ్రీనివాసులు మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
Admin
DNB News