DNB News - ఆంధ్రప్రదేశ్ / : చిత్తూరు జిల్లా 2005 సంవత్సరంలో గ్రేట్ విజన్ సొసైటీ -GVS ను స్థాపించి అణగారిన వర్గాలకు అండగా నిలుస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్న గ్రేట్ విజన్ సొసైటీ -GVS వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ జి.వి.సుబ్రహ్మణ్యం బాబు... గానుగ పెంట వెంకటరమణ ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం. ఆయన పెద్ద కుమారుడు మన జీవీఎస్ బాబు . ఈయనకు చిన్నపిల్లలంటే మహా ఇష్టం... పిల్లల హక్కులపై పోరాడుతూ ఎక్కడైతే బాల కార్మికులు ఉన్నారో వారిని చేరదీసి ఖచ్చితంగా వారిని చదివించి సమాజంలో వారికంటూ ఒక గుర్తింపు తీసుకురావాలని తపన ఆయనది అలా ఆయన జాతీయ బాల కార్మిక నిర్మూలన కార్యక్రమం నందు ఒక స్కూలు స్థాపించి ఎవరైతే బాల కార్మికులు ఉంటారు వారందరినీ ఆ పాఠశాలలో చేర్పించి దాదాపు 680 మంది బాల కార్మికులను వెతికి వారిని చేరదీసి విద్యపై మంచి అవగాహన కలిగేలా మంచి ఉపాధ్యాయుడుగా శిక్షణ కలిగించి ప్రస్తుతం వారు వివిధ ప్రాంతాలలో వృత్తిరీత్యా విద్యలు చేపడుతూ స్వశక్తితో సమాజంలో బ్రతుకుతున్నారు....!!!. బాల కార్మికుల నిర్మూలనే తన అభివృద్ధిగా భావించే ఆయనకు వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉండే పిల్లలతో వారి కుటుంబాలతోపని చేసే నైపుణ్యం కూడా ఉన్నది . వారికి కూడా మంచి విద్యను అందించే ప్రయత్నం చేసి వారికి ప్రభుత్వం అందించే పథకాలను వివరించి వారి జీవితాల్లో కూడా వెలుగు నింపారు మన బాబు గారు... అసలే పిల్లలు అంటే ఇష్టం అని చెప్పాం కదా అందుకుని పీలేరు నుంచి తన సేవలను విస్తృతం చేస్తూ మదనపల్లెలోని చైతన్య స్వచ్చంద సేవా సంస్థలోని నిరాశ్రయులైన పిలల క్షేమం కోసం 2020 నుండి చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ కొరకు అడ్మిన్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తూ ఆయన యొక్క సేవలు అనిర్వచనీయం... ఆయన సేవలను గుర్తించి ఎన్నో స్వచ్ఛంద సేవా సంస్థలు జాతీయస్థాయిలో అవార్డులత
Admin
DNB News