Friday, 17 April 2026 05:02:56 PM
# ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. # టి డి పి రాష్ట్ర అధ్యక్షులుగా రెండవసారి నియమితులైన పల్లా శ్రీనివాసరావు సన్మానించి, శుభాకాంక్షలు తెలిపిన బొండా యల్లాజీరావు, శ్రీదేవి లు # శాతవాహన అభివృద్ధికి కృషి - నూతన కార్యనిర్వాహక మండలి సభ్యులు # కాంగ్రెస్ సీనియర్ మైనార్టీ మహిళా నాయకురాలు సమాన మహమ్మద్ # గోడౌన్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు.. # ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి లో ఫ్రీజర్ పని చేయక పోవడం తో చనిపోయిన వారు పరిస్థితి దారుణం # తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు లో ఓ ఇంట్లో చోరీ # బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా భాషబోయిన ప్రదీప్ యాదవ్ నియామకం # ఘనంగా కిసాన్ నగర్ హిందూ సమ్మేళనం # ప్రాణహాని బెదిరింపుల నేపథ్యంలో పోలీసు రక్షణ కోరిన బి. జాఫర్.. # “మీ రక్షణ – మా బాధ్యత” అవగాహన ర్యాలీకి శ్రీకారం – మహిళల భద్రతపై కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ పిలుపు.. # 10 సూత్రాల అమలుపై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి.. # సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ # ఆకుపాముల గ్రామంలోని మాంటిస్సోరీ పాఠశాలలో "సురక్షితంగా ఇంటికి చేరుదాం ‘Arrive and Alive’" అవగాహన కార్యక్రమం # కొత్తగూడెం అరైవ్ అలైవ్ - రోడ్ సేఫ్టీ కార్యక్రమం # ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య # కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి, 12 మందికి గాయాలు # కుమార్తెను చంపి.. తాను ఆత్మహత్య చేసుకున్న తల్లి # రోడ్డుపై మొక్కజొన్నలు..! ద్విచక్రవాహనదారుడికి గాయాలు # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలి : జారే ఆదినారాయణ

అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభ విజయవంతం చేయండి: బండారి గిడ్డయ్య మాదిగ, గుమ్మల బాలస్వామి మాదిగ పిలుపు..

Date : 21 March 2026 05:24 PM Views : 87

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఈనెల 28న కర్నూలు జిల్లా, పత్తికొండ నియోజకవర్గం, వెల్దుర్తి మండలం బుక్కాపురం గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు పిలుపునిచ్చారు. గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఆదోని మునిసిపల్ ఆవరణంలో నిర్వహించిన సమావేశానికి ఎమ్మార్పీఎస్ పట్టణ ఇంచార్జ్ గుమ్మల బాలస్వామి మాదిగ అధ్యక్షత వహించగా, టౌన్ కన్వీనర్ వన్నెల మణికంఠ మాదిగ, కో-కన్వీనర్ జీ దత్తు మాదిగ సమన్వయం చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎంఈఎఫ్ నాయకులు ఎం. ఆంజనేయులు, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు మరియు నియోజకవర్గ ఇంచార్జ్ బండారి గిడ్డయ్య మాదిగ, ఎంఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ బాలన్న మాదిగ, జిల్లా కార్యదర్శి పి.ఎస్ వీరేష్ మాదిగ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ—ఈనెల 28న బుక్కాపురం గ్రామంలో మహాజననేత, పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ చేతుల మీదుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆదోని నియోజకవర్గం నుండి ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ మరియు అనుబంధ సంఘాల నాయకులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రకుల పేదలందరూ భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మాజీ పట్టణ అధ్యక్షులు యమ్ జగన్ మాదిగ, ఎంఎస్పీ మండల నాయకులు దిబ్బనకల్ ఊసేనప్ప మాదిగ, టౌన్ నాయకులు ఎం శాంతరాజు మాదిగ, మాదాస్ తిప్పన్న మాదిగ, అంజినప్ప మాదిగ, డనాపురం బసవరాజ్ మాదిగ, పర్వతపురం గుండప్ప మాదిగ తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :