DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఈనెల 28న కర్నూలు జిల్లా, పత్తికొండ నియోజకవర్గం, వెల్దుర్తి మండలం బుక్కాపురం గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు పిలుపునిచ్చారు. గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఆదోని మునిసిపల్ ఆవరణంలో నిర్వహించిన సమావేశానికి ఎమ్మార్పీఎస్ పట్టణ ఇంచార్జ్ గుమ్మల బాలస్వామి మాదిగ అధ్యక్షత వహించగా, టౌన్ కన్వీనర్ వన్నెల మణికంఠ మాదిగ, కో-కన్వీనర్ జీ దత్తు మాదిగ సమన్వయం చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎంఈఎఫ్ నాయకులు ఎం. ఆంజనేయులు, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు మరియు నియోజకవర్గ ఇంచార్జ్ బండారి గిడ్డయ్య మాదిగ, ఎంఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ బాలన్న మాదిగ, జిల్లా కార్యదర్శి పి.ఎస్ వీరేష్ మాదిగ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ—ఈనెల 28న బుక్కాపురం గ్రామంలో మహాజననేత, పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ చేతుల మీదుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆదోని నియోజకవర్గం నుండి ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ మరియు అనుబంధ సంఘాల నాయకులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రకుల పేదలందరూ భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మాజీ పట్టణ అధ్యక్షులు యమ్ జగన్ మాదిగ, ఎంఎస్పీ మండల నాయకులు దిబ్బనకల్ ఊసేనప్ప మాదిగ, టౌన్ నాయకులు ఎం శాంతరాజు మాదిగ, మాదాస్ తిప్పన్న మాదిగ, అంజినప్ప మాదిగ, డనాపురం బసవరాజ్ మాదిగ, పర్వతపురం గుండప్ప మాదిగ తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News