Friday, 17 April 2026 03:46:55 PM
# తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు లో ఓ ఇంట్లో చోరీ # బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా భాషబోయిన ప్రదీప్ యాదవ్ నియామకం # ఘనంగా కిసాన్ నగర్ హిందూ సమ్మేళనం # ప్రాణహాని బెదిరింపుల నేపథ్యంలో పోలీసు రక్షణ కోరిన బి. జాఫర్.. # “మీ రక్షణ – మా బాధ్యత” అవగాహన ర్యాలీకి శ్రీకారం – మహిళల భద్రతపై కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ పిలుపు.. # 10 సూత్రాల అమలుపై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి.. # సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ # ఆకుపాముల గ్రామంలోని మాంటిస్సోరీ పాఠశాలలో "సురక్షితంగా ఇంటికి చేరుదాం ‘Arrive and Alive’" అవగాహన కార్యక్రమం # కొత్తగూడెం అరైవ్ అలైవ్ - రోడ్ సేఫ్టీ కార్యక్రమం # ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య # కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి, 12 మందికి గాయాలు # కుమార్తెను చంపి.. తాను ఆత్మహత్య చేసుకున్న తల్లి # రోడ్డుపై మొక్కజొన్నలు..! ద్విచక్రవాహనదారుడికి గాయాలు # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలి : జారే ఆదినారాయణ # హుజూరాబాద్‌లో ఏసీబీ దాడి – అసిస్టెంట్ ఇంజనీర్ అరెస్ట్. # రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన కలెక్టర్ డా. ఏ. సిరి.. # ఘోర రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్. # నారీశక్తి తో నవభారతాన్ని నిర్మిస్తున్న మోదీ ప్రభుత్వం # సి. బి. యస్. ఈ. పదవ తరగతి పరీక్ష ఫలితాలలో పారమిత విద్యార్థుల ప్రభంజనం # అత్యుత్తమ మార్కులతో జాతియ స్థాయిలో మెరిసిన అల్ఫోర్స్ సీబీఎస్ఈ విద్యార్థులు

ఘనంగా కిసాన్ నగర్ హిందూ సమ్మేళనం

Date : 17 April 2026 09:50 AM Views : 3

DNB News - తెలంగాణ / : కరీంనగర్ నగరంలో కిసాన్ నగర్ బస్తీలో చత్రపతి శివాజీ హిందూ సమ్మేళన సమితి ఆధ్వర్యంలో ఘనంగా హిందూ సమ్మేళనం నిర్వహించారు. గోపూజతో కార్యక్రమం అనంతరం హిందూ సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళన కార్యక్రమానికి ప్రధాన వక్తగా హాజరైన ఆర్ఎస్ఎస్ కరినగర్ విభాగ ప్రచార ప్రముఖ్ తడి గొప్పల శంకరయ్య మాట్లాడుతూ సమాజంలో కులాల పేరుతో పెరుగుతున్న విభజన తో హిందువులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని , హిందూ సమాజం ఐక్యంగా ఉన్నప్పుడే దేశం , ధర్మం సుస్థిరంగా ఉంటుందన్నారు. ఐకమత్యత లేని కారణంగా నేడు ప్రపంచంలోని అనేక దేశాలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయన్నారు. హిందువులు ఐక్యంగా, సంఘటితశక్తిగా మారాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు. హిందూ ధర్మం ఎంతో గొప్పదని,. సనాతన ధర్మ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ప్రతి ఒక్కరు దేశభక్తి, జాతీయభావం పెంపొందించుకోవాలని సూచించారు. హిందూల ఐక్యతను బలోపేతం చేయడమే లక్ష్యంగా హిందూ సమ్మేళనాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయని తెలిపారు. సంఘ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆర్ఎస్ఎస్ పిలుపునిచ్చిన మేరకు హిందూ సమ్మేళనాలు విజయవంతంగా కొనసాగుతున్నాయన్నారు. ఆర్ఎస్ఎస్ వందేళ్లు దేశం, ధర్మం, సంస్కృతి , సాంప్రదాయాల పరిరక్షణ కోసం నిరంతరయంగా పని చేసిందన్నారు. నేడు శతాబ్ది ఉత్సవాలలో భాగంగా పంచ పరివర్ధన్ కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేసిందన్నారు. సంఘం దేశహితం కోసం ఎల్లవేళలా పనిచేస్తూ ముందు కొనసాగుతుందన్నారు. రాష్ట్ర సేవికాసమితి ప్రాంత శారీరక్ ప్రముక్ లెక్కల రమ మాట్లాడుతూ హిందూ ధర్మం ఎంతో పురాతనమైనదని, హిందూ ధర్మం విశిష్టమైన చరిత్ర కలిగి ఉందన్నారు. హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు నడుం బిగించాలన్నారు. సనాత ధర్మ పరిరక్షణ మనందరికీ శ్రీరామరక్ష లాంటిదన్నారు. అనంతరం. ముఖ్యఅతిథిగా హాజరైన మంగళంపల్లి శ్రీనివాస్ శర్మ మాట్లాడారు.ఈ కార్యక్రమంలో సమ్మేళనము కార్యనిర్వహణ సమితి అధ్యక్షుడు పసుల మహిపాల్ ప్రధాన కార్యదర్శి గాజుల కృష్ణ జన జాగరణ సమితి అధ్యక్షుడు ఎన్నం శ్రీనివాస్ , ప్రధాన కార్యదర్శి మేంగని రాజయ్య ఉపాధ్యక్షులు ఉప కార్యదర్శులు బస్తీ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :