Thursday, 23 April 2026 04:04:55 PM
# సూర్యాపేట్ జిల్లా నడిగూడెం మండలం కార్యాలయంలో పార్టీ కార్యకర్తలతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న - బొల్లం మల్లయ్య యాదవ్ # శ్రీ భగీరథ మహర్షి ఆశయాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం... జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జ్యోతి # శాంతియుత వాతావరణంతో పరిశుభ్రమైన నగరంగా ఆదర్శంగా ఖమ్మం నిలిచేలా చర్యలు # కోదాడ ఆర్టీసీ డిపో వద్ద తమ సమస్యల పరిష్కారానికి సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలపడం జరిగింది. # శ్రీ రామానుజాచార్యుల 1009 జయంతి సందర్భంగా. ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించిన. గ్రామ సర్పంచ్ డాక్టర్ వేమూరి సత్యనారాయణ. # తెలంగాణ వడ్డెర సంఘం అండ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మునగాల మండలం నాయకులు గోగుల లక్ష్మణ్ వడ్డెర చైతన్య యాత్ర # నషా ముక్త్ భారత్ అవగాహన వాకథాన్‌లో కలెక్టర్, ఎస్పీ పాల్గొనడం... # జస్టిస్ పిసీ ఘోష్ కమిషన్ పై హైకోర్టు తీర్పుతో న్యాయం గెలిచింది # ఉపాధి హామీ చట్టం కూలీలకు వరం లాంటిది జి రాంజీ పథకం కూలీలకు వ్యతిరేకమైనది జి రామ్ జి రద్దుకై ఉద్యమిద్దాం ములకలపల్లి రాములు పిలుపు # జగన్నాధపురం గ్రామంలో పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమం.. # విజయలక్ష్మి సమేత కనకదుర్గా దేవాలయం వావిలాలపల్లి, కరీంనగర్ సధ్వజ పరివార స్థిర ప్రతిష్టా మహోత్సవం # ​లైసెన్స్ లేకుండా టీవీఎస్ ఎక్స్‌ఎల్ నడిపితే చర్యలు: 140 వాహనాల సీజ్ - ట్రాఫిక్ ఏసీపీ యాదగిరిస్వామి # ఖమ్మం జిల్లా పేదప్రజలకు అండగా శ్రీచక్ర హాస్పిటల్. # డ్రాయింగ్ బుక్స్, స్కెచ్ పెన్నులు , కుక్కర్ ను అందించిన కార్పొరేటర్ మాసం గణేష్ # నగరంలోని అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి.-తుమ్మల నాగేశ్వరరావు # ఆదోని మేక వంక ఆక్రమణలపై ఆగ్రహం – సిమెంట్ కాలువ తొలగించాలంటూ నూర్ అహ్మద్ డిమాండ్... # పత్తికొండలో OHSR ట్యాంక్ పరిశీలన – నీటి నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టిన జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి... # ఎన్.టి.ఎల్. సంస్థ ఆధ్వర్యంలో ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో 19000/ వేలరూపాయల నిత్యవసర సరుకులు అందజేత # నంద్యాలలో SDPI లీడర్స్ కాన్క్లేవ్ – ఆదోని యూనిట్ చురుకైన భాగస్వామ్యం.. # చైన్ స్నాచింగ్ కేసు ఛేదన – నిందితుడి అరెస్ట్, పల్సర్ బైక్ స్వాధీనం..

జస్టిస్ పిసీ ఘోష్ కమిషన్ పై హైకోర్టు తీర్పుతో న్యాయం గెలిచింది

Date : 23 April 2026 02:12 PM Views : 7

DNB News - తెలంగాణ / : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు పై రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు హైకోర్టు తీర్పే సరైన సమాధానం కమిషన్ పేరుతో కాలేశ్వరం ప్రాజెక్టు లక్ష్యాన్ని దెబ్బ తీయాలనే రేవంత్ ప్రభుత్వ కుట్రలను తిప్పి కొట్టిన హైకోర్టు తీర్పు రేవంత్ రెడ్డి తక్షణమే కెసిఆర్ కు క్షమాపణలు చెప్పాలి బిఆర్ఎస్ సీనియర్ నాయకులు సుంకర అజయ్ కుమార్ DNB న్యూస్ ఛానల్ కోదాడ రాయల సతీష్ రిపోర్టర్ * మునగాల, ఏప్రిల్ 23 తెలంగాణ రాష్ట్ర వరదప్రదాయిని గా పేరుగాంచిన కాలేశ్వరం ప్రాజెక్టుని నిర్మాణం చేసిన నాటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనాటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావులపై ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నో రకాల కుట్రలు కుతంత్రాలు చేస్తూ అవినీతి ఆరోపణలతో జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ని నియమించి, కమిషన్ రిపోర్టు సహాయంతో సిబిఐ విచారణకు ఆదేశించి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి హరీష్ రావులను జైలుకు పంపాలన ఏకైక ఉద్దేశంతో తన అధికారాన్ని ఉపయోగించి రేవంత్ రెడ్డి చేస్తున్న కుట్ర కోణాన్ని నేడు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు న్యాయపరంగా విచారించి పీసీ ఘోష్ కమిషన్ విచారణ నివేదిక ప్రాథమిక సూత్రాలను అనుసరించలేదని, ఈ కమిషన్ నివేదికతో నాటి ప్రభుత్వ పెద్దలపై చర్యలు తీసుకోవడం న్యాయ సూత్రాలకు విరుద్ధమని కావున తక్షణమే పిసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారాలతో ఎలాంటి చర్యలు తీసుకోవడానికి వీలు లేదని ఆదేశాలు ఇవ్వడం హర్షణీయమని బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సుంకర అజయ్ కుమార్ అన్నారు, బుధవారం మండల కేంద్రంలోని స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పిసీ ఘోష్ కమిషన్ ఎలాంటి నిబంధనలు పాటించలేదని తద్వారా కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా నాటి ముఖ్యమంత్రి కెసిఆర్, భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్వరరావు, మరియు ప్రభుత్వ అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోవడానికి వీలులేదని హైకోర్టు తీర్పునివ్వడంతో కెసిఆర్, హరీష్ రావు పై గత రెండున్నరెండ్లుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపుతో చేస్తున్న కుట్ర కోణాన్ని న్యాయస్థానం పటాపంచలు చేసిందని, ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలను పక్కనపెట్టి హుందాగా పరిపాలన చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో వరద ప్రధాయినిగా పేరుగాంచిన కాలేశ్వరం ప్రాజెక్టుపై చేస్తున్న అసత్య ఆరోపణలను వెనక్కు తీసుకొని తక్షణమే ప్రాజెక్టునందు ధ్వంసం అయిన రెండు పిల్లర్లకు మరమతులు నిర్వహించి రాష్ట్ర ప్రజలకు సాగునీళ్లు, తాగునీళ్లు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన హితువు పలికారు, తమపార్టీ అధినేత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై, హరీష్ రావు పై కావాలని ప్రస్తుత ప్రభుత్వం రేవంత్ రెడ్డి, మంత్రులు ఎన్ని రకాలుగా దాడి చేసిన చివరికి న్యాయమే గెలిచిందన్నారు, నాటి బిఆర్ఎస్ ప్రభుత్వంలో కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి లక్షల ఎకరాలకు సాగునీళ్లు, వేలాది గ్రామాలకు తాగునీరు అందించిన కేసీఆర్ హరీష్ రావు అంకుటితో దీక్షతోనే దేశంలోనే వరి ధాన్యం పండించిన ప్రథమ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం రికార్డు సాధించిన విషయాన్ని విస్మరించిన ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజాక్షేత్రంతో పాటు న్యాయస్థానంలో కూడా ఎదురు దెబ్బ తప్ప లేదన్నారు, కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కేసీఆర్ హరీష్ రావు లు పడిన కష్టానికి మరియు ఓటుకు నోటు కేసు దొంగ రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఆరోపణలపై నేడు న్యాయస్థానంలో కడిగిన ముత్యంలో కేసీఆర్, హరీష్ రావులు ప్రజాక్షేత్రంలో నిలవడం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారని ఆయన తెలిపారు, ఇప్పటికైనా రేవంత్ రెడ్డి తక్షణమే కెసిఆర్ కు హరీష్ రావు లకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు, ఈ సమావేశంలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తొగరు రమేష్, మునగాల మాజీ పిఎసిఎస్ చైర్మన్ కందిబండ సత్యనారాయణ పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :