DNB News - తెలంగాణ / : ఇల్లందు ప్రభుత్వ వైద్యశాల ను ఈరోజు కాయకల్ప ఎక్స్టర్నల్ అసెస్మెంట్ టీం డాక్టర్ రఘు పూజారి, డాక్టర్ జోత్స్న మరియు వారి బృందం సందర్శించారు. హాస్పిటల్లో పేషెంట్స్ కు అందుతున్న పలు సౌకర్యాలు, వ్యాక్సినేషన్ కి సంబంధించిన వివరాలు. ల్యాబ్, నర్సింగ్ సేవలు, మెడికల్ రికార్డ్స్, డాక్టర్స్ పనితీరు, జనరల్ మరియు పీడియాట్రిక్ వార్డ్, డెంటల్ సర్వీసెస్, లేబర్ రూమ్ మరియు ఆపరేషన్ థియేటర్, పోస్టుమార్టం, డయాలసిస్ సౌకర్యాలు మొదలైన అన్ని రికార్డ్స్ చెక్ చేసి మరియు పేషెంట్ నుండి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ఒక 30 పడకల ఆసుపత్రి లో పేషెంట్స్ కి అందుతున్న స్పెషలిస్ట్ సేవలు, డయాలసిస్ మరియు సర్జరీ సేవలపట్ల డాక్టర్స్ మరియు నర్సింగ్ ఆఫీసర్స్ సేవల పట్ల రికార్డ్స్ నిశితంగా పరిశీలించి పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇల్లందు హాస్పిటల్ కాయకల్ప అవార్డు తోని సరిపెట్టుకోకుండా ముస్కాన్ అవార్డ్ మరియు ఎంక్వైష్ అవార్డు కూడా అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో పలువురు స్పెషలిస్ట్ డాక్టర్స్, నర్సింగ్ సిబ్బంది మరియు శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
Admin
DNB News