DNB News - తెలంగాణ / : మునగాల:మండలపరిధిలోని కలకోవ గ్రామంలోశనివారం సంఘసంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే 199 జయంతి వేడుకలు అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో కోదాడ నియోజకవర్గ,స్వేరో కార్యదర్శి గద్దల మోహన్ కుమార్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది,ఈ వేడుకలసందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగానివాళులర్పించారు, ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామసర్పంచ్ మండవ వెంకటాద్రి, ఎమ్మార్పీఎస్ జిల్లాప్రధానకార్యదర్శి పాతకోట్ల నాగరాజు, మాజీ సర్పంచ్ చిర్ర శ్రీనివాస్, పూలమాలవేసి నివాళులర్పించారు,ఈసందర్భంగా సర్పంచ్ మండవ వెంకటాద్రి మాట్లాడుతూ,బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం వారి చైతన్యం కోసం కృషి చేశారని కొనియాడారు ఆనాటి కాలంలో బడుగు బలహీన వర్గాల వారికి వారి సతీమణి సావిత్రిబాయి పూలే మొదటి మహిళా టీచర్ గా విద్యాబుద్ధులు నేర్పారని అన్నారు,వారి ఆశయసాధన కోసం పనిచేస్తామని అన్నారు, ఈకార్యక్రమంలో రెండో వార్డ్ మెంబర్ పాతకోట్ల రమణ, కాలనీ పెద్ద మాదిగ కుడుముల వీరయ్య, మునగలేటి తిరపయ్య,పాతకోట్ల లింగయ్య, కుంభజడ శ్రీను, చిర్రా వెంకటేశ్వర్లు,బచ్చలకూరి సత్యం, గద్దలగిరి,తదితరుల పాల్గొన్నారు
Admin
DNB News