DNB News - తెలంగాణ / : పనులు నాణ్యతతో నిర్ణీత కాలంలో పూర్తి చేయాలి .... రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వర రావు ఖమ్మం 44వ డివిజన్ లో 1.5 కోట్లతో చేపట్టిన సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి తుమ్మల -------------------------- ఖమ్మం, నగర అభివృద్ధి పనులు నాణ్యతతో, నిర్ణీత కాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ, చేనేత, జౌళి, సహకార, మార్కెటింగ్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 44వ డివిజన్లో కోటి 50 లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ 44వ డివిజన్ లో చేపట్టిన అభివృద్ధి పనులు ప్రజలకు దీర్ఘకాల ప్రయోజనం చేకూరేలా నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనులు నిర్ణీత కాలంలో పూర్తయ్యేలా కాంట్రాక్టర్లు కట్టుబడి ఉండాలని తెలిపారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, ప్రజలు పనులను పర్యవేక్షిస్తూ నాణ్యత కాపాడాలని సూచించారు. ఖమ్మం నగరాన్ని పరిశుభ్రంగా, పచ్చదనంతో అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పూనుకొల్లు నీరజ, కమీషనర్ అభిషేక్ అగస్త్య, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు, అసిస్టెంట్ కమీషనర్ అనిల్ కుమార్, ఆర్డీఓ శ్రీనివాస్, సంబంధిత శాఖల జిల్లా అధికారులు, కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు, వ్యాపారస్తులు, తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News