Friday, 17 April 2026 05:07:53 PM
# ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. # టి డి పి రాష్ట్ర అధ్యక్షులుగా రెండవసారి నియమితులైన పల్లా శ్రీనివాసరావు సన్మానించి, శుభాకాంక్షలు తెలిపిన బొండా యల్లాజీరావు, శ్రీదేవి లు # శాతవాహన అభివృద్ధికి కృషి - నూతన కార్యనిర్వాహక మండలి సభ్యులు # కాంగ్రెస్ సీనియర్ మైనార్టీ మహిళా నాయకురాలు సమాన మహమ్మద్ # గోడౌన్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు.. # ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి లో ఫ్రీజర్ పని చేయక పోవడం తో చనిపోయిన వారు పరిస్థితి దారుణం # తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు లో ఓ ఇంట్లో చోరీ # బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా భాషబోయిన ప్రదీప్ యాదవ్ నియామకం # ఘనంగా కిసాన్ నగర్ హిందూ సమ్మేళనం # ప్రాణహాని బెదిరింపుల నేపథ్యంలో పోలీసు రక్షణ కోరిన బి. జాఫర్.. # “మీ రక్షణ – మా బాధ్యత” అవగాహన ర్యాలీకి శ్రీకారం – మహిళల భద్రతపై కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ పిలుపు.. # 10 సూత్రాల అమలుపై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి.. # సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ # ఆకుపాముల గ్రామంలోని మాంటిస్సోరీ పాఠశాలలో "సురక్షితంగా ఇంటికి చేరుదాం ‘Arrive and Alive’" అవగాహన కార్యక్రమం # కొత్తగూడెం అరైవ్ అలైవ్ - రోడ్ సేఫ్టీ కార్యక్రమం # ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య # కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి, 12 మందికి గాయాలు # కుమార్తెను చంపి.. తాను ఆత్మహత్య చేసుకున్న తల్లి # రోడ్డుపై మొక్కజొన్నలు..! ద్విచక్రవాహనదారుడికి గాయాలు # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలి : జారే ఆదినారాయణ

భద్రాద్రి రామాలయం అభివృద్ధికి మొదటి విడత నిధులు మంజూరు

Date : 26 March 2026 04:25 PM Views : 33

DNB News - తెలంగాణ / : భద్రాద్రి రామాలయం అభివృద్ధికి మొదటి విడత నిధులు మంజూరు చేస్తూ దేవాదాయ శాఖ పరిపాలన జీవో నెంబర్ ఆర్.టి 167 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది..!! ఇందులో భాగంగానే రూ.351 కోట్ల నిధులు మంజూరు చేసింది.. ప్రభుత్వం. రామాలయం అభివృద్ధికి మొత్తం రూ. 586 కోట్లతో మూడు దశల్లో మాస్టర్ ప్లాన్ సిద్ధం అయింది. ఈ క్రమంలోనే తొలి దశలో భాగంగా రూ. 351 కోట్లు మంజూరు అయ్యాయి. 2024 మార్చి 11న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలంలో పర్యటించిన సందర్బంగా రామాలయం అభివృద్ధి, భద్రాచలం పట్టణం అభివృద్ధి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఇందులో భాగంగానే తాజాగా మొదటి దశ పనులకు పరిపాలన ఉత్తర్వులు దేవాదాయ శాఖ డైరెక్టర్ జారీ చేశారు. ఇక ఈ శుక్రవారం శ్రీ రామ నవమి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు ఆనవాయితీగా సమర్పించేందుకు వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, ఈ సందర్భంగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. కాగా భద్రాద్రి ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :