DNB News - తెలంగాణ / : భద్రాద్రి రామాలయం అభివృద్ధికి మొదటి విడత నిధులు మంజూరు చేస్తూ దేవాదాయ శాఖ పరిపాలన జీవో నెంబర్ ఆర్.టి 167 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది..!! ఇందులో భాగంగానే రూ.351 కోట్ల నిధులు మంజూరు చేసింది.. ప్రభుత్వం. రామాలయం అభివృద్ధికి మొత్తం రూ. 586 కోట్లతో మూడు దశల్లో మాస్టర్ ప్లాన్ సిద్ధం అయింది. ఈ క్రమంలోనే తొలి దశలో భాగంగా రూ. 351 కోట్లు మంజూరు అయ్యాయి. 2024 మార్చి 11న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలంలో పర్యటించిన సందర్బంగా రామాలయం అభివృద్ధి, భద్రాచలం పట్టణం అభివృద్ధి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఇందులో భాగంగానే తాజాగా మొదటి దశ పనులకు పరిపాలన ఉత్తర్వులు దేవాదాయ శాఖ డైరెక్టర్ జారీ చేశారు. ఇక ఈ శుక్రవారం శ్రీ రామ నవమి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు ఆనవాయితీగా సమర్పించేందుకు వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, ఈ సందర్భంగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. కాగా భద్రాద్రి ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.
Admin
DNB News