DNB News - తెలంగాణ / : జిల్లాలో ఎండల తీవ్రత అధికంగా కొనసాగుతున్న నేపథ్యంలో, రాబోయే 3-4 రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల, ఐపీఎస్ సూచించారు. అనవసరంగా ప్రజలు బయటకు రావడం తగ్గించాలని, ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు మరింత జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా వాటర్ బాటిల్స్, మజ్జిగ, ఓఆర్ఎస్ వంటి ద్రవ పదార్థాలను వెంట తీసుకెళ్లాలని సూచించారు. అదేవిధంగా బయటకెళ్ళేటప్పుడు తలపై క్యాప్ పెట్టుకోవాలని,శరీరం నీరసం (డీహైడ్రేషన్) కాకుండా చూసుకోవాలని,మధ్యాహ్న వేళల్లో ఎండలో ఎక్కువసేపు ఉండకుండా చూసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఈ సూచనలు పాటించడం అత్యంత అవసరమని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు.ఇకపోతే, దొంగలతో అప్రమత్తంగా ఉండాలన్నారు.ఈ పరిస్థితులను దొంగలు అవకాశంగా మలచుకునే అవకాశం ఉన్నందున ప్రజలు తమ ఇళ్ల వద్ద, పరిసర ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు గమనించిన వెంటనే సమీప పోలీసులకు సమాచారం ఇవ్వాలని జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల, ఐపీఎస్ సూచించారు.
Admin
DNB News