DNB News - తెలంగాణ / : కరీంనగర్ నగరంలోని అజ్మత్పుర, ఎస్ బి ఐ బ్యాంక్ టవర్ సర్కిల్ బ్రాంచ్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన కార్తికేయ జువెలరీస్ ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సోమవారం ఘనంగా ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి అనంతరం ఆయన షోరూమ్లోని నూతన ఆభరణాల కలెక్షన్ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్ కుమార్ (కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి),కొలగాని శ్రీనివాస్ (నగర మేయర్),యాదగిరి సునీల్ రావు (రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి & డిప్యూటీ మేయర్)స్థానిక బీజేపీ కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు మరియు ప్రముఖ వ్యాపారవేత్తలు పాల్గొన్నారు.
Admin
DNB News