Friday, 17 April 2026 08:05:42 PM
# జీఎస్టీ అమలు సమన్వయంపై కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం # రాయలసీమ సాగునీటి హక్కుల కోసం వైఎస్ఆర్సీపీ సమాలోచన సమావేశం # కేంద్ర మంత్రి బండి సంజయ్ ని కలిసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం # విద్యార్థుల ప్రాణాలతో ఆటలాడుతున్న స్కూల్ యాజమాన్యం – ఇంకా చర్యలు ఎందుకు లేవు?”.. # అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి # ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. # టి డి పి రాష్ట్ర అధ్యక్షులుగా రెండవసారి నియమితులైన పల్లా శ్రీనివాసరావు సన్మానించి, శుభాకాంక్షలు తెలిపిన బొండా యల్లాజీరావు, శ్రీదేవి లు # శాతవాహన అభివృద్ధికి కృషి - నూతన కార్యనిర్వాహక మండలి సభ్యులు # కాంగ్రెస్ సీనియర్ మైనార్టీ మహిళా నాయకురాలు సమాన మహమ్మద్ # గోడౌన్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు.. # ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి లో ఫ్రీజర్ పని చేయక పోవడం తో చనిపోయిన వారు పరిస్థితి దారుణం # తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు లో ఓ ఇంట్లో చోరీ # బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా భాషబోయిన ప్రదీప్ యాదవ్ నియామకం # ఘనంగా కిసాన్ నగర్ హిందూ సమ్మేళనం # ప్రాణహాని బెదిరింపుల నేపథ్యంలో పోలీసు రక్షణ కోరిన బి. జాఫర్.. # “మీ రక్షణ – మా బాధ్యత” అవగాహన ర్యాలీకి శ్రీకారం – మహిళల భద్రతపై కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ పిలుపు.. # 10 సూత్రాల అమలుపై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి.. # సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ # ఆకుపాముల గ్రామంలోని మాంటిస్సోరీ పాఠశాలలో "సురక్షితంగా ఇంటికి చేరుదాం ‘Arrive and Alive’" అవగాహన కార్యక్రమం # కొత్తగూడెం అరైవ్ అలైవ్ - రోడ్ సేఫ్టీ కార్యక్రమం

అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి

Date : 17 April 2026 06:03 PM Views : 3

DNB News - తెలంగాణ / : డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ భారత దేశంలో విశిష్టమైన పాత్ర పోషించారని మరియు వారు చేసిన సేవలు చరిత్ర పుటల్లో నిలిచిపోతాయని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి‌నరేందర్ రెడ్డి వారి వర్ధంతిని పురస్కరించుకొని ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై వారు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ రాష్ట్రపతిగా మరియు భారతదేశ మొదటి ఉపరాష్ట్రపతిగా అనేక సేవలు అందించారని మరియు వారి యొక్క పరిజ్ఞానంతో ప్రజలకు అనేక పథకాలను ప్రవేశపెట్టి ప్రజల యొక్క శ్రేయస్సు కోరిన గొప్ప రాజనీతిఘ్నుడని కొనియాడారు. వారిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని మరియు ఉపాధ్యాయ వృత్తిని నమ్ముకొని విద్యార్థులకు ఎన్నో విధాలుగా సేవలను అందించి ఉత్తమమైన స్థానాలలో స్థిరపరచి వారి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని కొనియాడారు‌ వారు చేసిన సేవలకు మరియు రూపొందించిన పథకాలకు భారతదేశ ప్రభుత్వం అత్యున్నత పురస్కారమైన భారతరత్నతో సత్కరించి మరియు వారి జన్మదిన ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం జరిగిందని వారు చెప్పారు. వివిధ కళాశాలల్లో ప్రొఫెసర్ గా పనిచేసి విద్యా మరియు జీవితం యొక్క ప్రాముఖ్యతను తన యొక్క మాటల ద్వారా తెలిపి విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడంలో విజయవంతులైనారని చెప్పవచ్చు. భారత రాయబారిగా ఆయన చేసిన సేవలు చాలా సమాజహితమైనవని, హిందూ వేదాంతాన్ని పాశ్చాత ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప తత్వవేత్తని కొనియాడారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఇతర దేశాలకు రాయబారిగా పనిచేసి భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని స్వస్తిరపరచి ఎన్నో సేవలు చేశారని వారు గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ వారిని ఆదర్శంగా తీసుకోవాలని మరియు వారి శ్రమించిన తీరు చాలా ప్రేరేపించదగినదని అని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :