DNB News - తెలంగాణ / : తెలంగాణలో సంచలనం సృష్టించిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. దాదాపు 24 ఏళ్ల తర్వాత… ఈ కేసులో నిందితుడు సిద్ధార్థ్ రెడ్డి మీడియా ముందుకు వచ్చారు. సుప్రీంకోర్టు తుది తీర్పు మేరకు… నాంపల్లి కోర్టు లో లొంగిపోయారు. ఇన్నేళ్లుగా అమెరికాలో స్థిరపడిన సిద్ధార్థ్ రెడ్డి… ఇటీవలే భారత్కు వచ్చి కోర్టులో హాజరయ్యారు. 2002 ఫిబ్రవరి 23న జరిగిన ఈ ఘటనలో… కూల్డ్రింక్లో పురుగుల మందు కలుపుకుని తాగిన ప్రత్యూష, సిద్ధార్థ్ రెడ్డి… ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రత్యూష మృతి చెందగా, సిద్ధార్థ్ రెడ్డి కోలుకున్నారు. ప్రత్యూషది ఆత్మహత్య కాదని… హత్యేనంటూ ఆమె తల్లి సుదీర్ఘకాలం న్యాయపోరాటం సాగించారు. ఈ కేసులో సిద్ధార్థ్ రెడ్డి ప్రేరేపణ కారణంగా ఆత్మహత్య జరిగిందన్న అభియోగాలపై… ట్రయల్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే అనంతరం హైకోర్టు శిక్షను రెండేళ్లకు తగ్గించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించగా… సుదీర్ఘ విచారణ అనంతరం హైకోర్టు తీర్పును సమర్థిస్తూ సుప్రీంకోర్టు పిటిషన్ను కొట్టేసింది. అదేవిధంగా… నాలుగు వారాల్లోగా లొంగిపోవాలని ఆదేశించిన సుప్రీంకోర్టు… ఆ ఆదేశాల మేరకు సిద్ధార్థ్ రెడ్డి నాంపల్లి కోర్టులో లొంగిపోయారు. ఈ పరిణామంతో… చాలా ఏళ్లుగా కొనసాగుతున్న ఈ కేసులో కీలక మలుపు ఏర్పడింది
Admin
DNB News