Sunday, 02 August 2026 08:20:32 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

ఖమ్మం: సైబర్ నేరాల దోపిడీ కేసులో కీలక నిందితుడైన ఉడతనేని వికాస్ చౌదరి

Date : 23 February 2026 02:14 PM Views : 91

DNB News - తెలంగాణ / : ఖమ్మం: సైబర్ నేరాల దోపిడీ కేసులో కీలక నిందితుడైన ఉడతనేని వికాస్ చౌదరి మరికాసేపట్లో ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ముందు లొంగిపోనున్నట్లు తెలిసింది. సరిగ్గా రెండు నెలల క్రితం.. గత డిసెంబర్ 24వ తేదీన ఖమ్మం జిల్లా పెనుబల్లి పోలీసులు నమోదు చేసిన సైబర్ నేరాల కేసులో ఉడతనేని వికాస్ చౌదరి అత్యంత కీలక నిందితుడు కావగం గమనార్మం. మొత్తం రూ. 549.95 కోట్ల రూపాయల ఈ దోపిడీ కేసులో పోట్రు ప్రవీణ్, పోట్రు మనోజ్ కళ్యాణ్ అనే వ్యక్తులు సహా మొత్తం 20 మందిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో కీలక నిందితునిగా పోలీసులు భావిస్తున్న ఉడతనేని వికాస్ చౌదరి మాత్రం గడచిన రెండు నెలలుగా తప్పించుకుని తిరుగుతున్నాడు. అధికార పార్టీకి చెందిన ఓ రాజకీయ నాయకుడి అండదండలు పుష్కలంగా ఉన్నట్లు ప్రచారం జరిగిన నేపథ్యంలో వికాస్ చౌదరి పోలీసులకు ఇప్పటికీ చిక్కకపోవడం గమనార్హం. గడచిన రెండు నెలలుగా పెనుబల్లి పోలీసులు ఎంతగా గాలిస్తున్నప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ఇదే దశలో పోలీసులు తనను అరెస్ట్ చేయకుండా వికాస్ చౌదరి యాంటిసిపేటరీ బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నించినట్లు సమాచారం. హైకోర్టులో ముందస్తు బెయిల్ యత్నాలు ఫలించకపోవడంతో అనివార్యంగా వికాస్ చౌదరి లొంగుబాటను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. మరికొద్ది గంటల్లోనే సైబర్ నేరాల దోపిడీలో కీలక నిందితునిగా వార్తల్లోకి వచ్చిన వికాస్ చౌదరి ఖమ్మం పోలీస్ కమిషన్ సునీల్ దత్ ముందు లొంగిపోనున్నట్లు విశ్వసనీయ సమాచారం.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :