DNB News - తెలంగాణ / : ఆదోని పట్టణంలోని సిటీ ఫుట్బాల్ క్లబ్ ఆదోని ఆధ్వర్యంలో “Sports for Unity” నినాదంతో ఈ నెల 15, 16 తేదీలలో నిర్వహించిన అంతరాష్ట్ర 7-A సైడ్ ఇన్విటేషనల్ ఫుట్బాల్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది. మొత్తం 16 జట్లు పాల్గొన్న ఈ టోర్నమెంట్లో జిల్లా, రాష్ట్ర స్థాయి క్రీడాకారులు తమ ప్రతిభను చాటుతూ ఉత్కంఠభరిత పోటీలను అందించారు. ఫైనల్ మ్యాచ్లో CFC ఆదోని జట్టు, విజయవాడ ఇజాక్ FC జట్టుతో తలపడగా అద్భుత ఆటతీరును ప్రదర్శించిన CFC ఆదోని జట్టు విజేతగా నిలిచి ట్రోఫీని కైవసం చేసుకుంది. యువతలో క్రీడాస్ఫూర్తి, ఐక్యత, క్రమశిక్షణ, ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో ఈ టోర్నమెంట్ను నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ విజేత జట్టుకు ట్రోఫీ, బహుమతులు అందజేసి క్రీడాకారులను అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువత క్రీడలను అలవర్చుకోవడం ద్వారా శారీరకంగా, మానసికంగా దృఢంగా ఎదుగుతారని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. టోర్నమెంట్ నిర్వహణలో సిటీ ఫుట్బాల్ క్లబ్ ఆదోని అధ్యక్షుడు సైద్ సైఫుల్ల బాషా , కార్యదర్శి P. మస్తాన్ వలి , సంయుక్త కార్యదర్శులు S. జగన్నాథ్ , K. సురేంద్ర కీలక పాత్ర పోషించారు. ఈ కార్యక్రమంలో క్రీడాభిమానులు, స్థానిక నాయకులు, యువకులు, టిడిపి నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
DNB News