DNB News - తెలంగాణ / : కరీంనగర్ చొప్పదండి శాసనసభ్యులు, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు . మేడిపల్లి సత్యం బుధవారం ఢిల్లీలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యం కేంద్ర మంత్రితో మాట్లాడుతూ కరీంనగర్ జగిత్యాల జాతీయ రహదారి ఎన్ హెచ్ 563 విస్తరణ పనుల్లో జాప్యం జరుగుతోందని, దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రహదారి పనుల పురోగతిలో వేగం పెంచి, నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. ఉత్తర తెలంగాణ జిల్లాలను కలిపే ఈ కీలకమైన జాతీయ రహదారి పూర్తయితే కరీంనగర్, జగిత్యాల ప్రజలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల వారికి రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని, వాణిజ్యం, వ్యవసాయ రంగాలు అభివృద్ధి చెందుతాయని ఎమ్మెల్యే వివరించారు దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి పనులు వేగవంతం చేసేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
Admin
DNB News