DNB News - తెలంగాణ / : కొత్తగూడెం : జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాలతో కొత్తగూడెం సబ్ డివిజిన్ వ్యాప్తంగా పకడ్బందీగా ట్రాఫిక్ నియమాలు అమలు చేయనున్నారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ ఆధ్వర్యంలో కొత్తగూడెం సబ్ డివిజనల్ వ్యాప్తంగా ట్రాఫిక్ కంట్రోల్ లో భాగంగా బారికేడ్లలను సిద్ధం చేశారు. విరిగిపోయి, అంద విహీనంగా ఉన్న బారికేడ్లు కొత్త రూపు సంతరించుకుని చూడ ముచ్చటగా ఉన్నాయి. వివిధ రంగుల్లో ఉన్న వాటిని యూనిఫామ్ గా ఎరుపు, నీలం రంగులోకి మార్చారు. సరిగా వినియోగించని బారికేడ్లను మరమ్మతులు చేపట్టి, రంగులు వేసి నూతన బారికేడ్లగా మార్చారు.
Admin
DNB News