DNB News - తెలంగాణ / : ట్రినిటీ ది స్కూల్ ఆఫ్ లెర్నింగ్, సాలెహ్నగర్లో ఒకినావా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ట్రినిటీ ది స్కూల్ ఆఫ్ లెర్నింగ్ మరియు బిర్లా ఓపెన్ మైండ్స్ విద్యార్థులు ఎంతో ఉత్సాహం, క్రమశిక్షణతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రినిటీ విద్యాసంస్థల వ్యవస్థాపకులు దాసరి మనోహర్ రెడ్డి ఛైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి డైరెక్టర్ దాసరి మమత రెడ్డి విద్యార్థులను అభినందించి, మార్షల్ ఆర్ట్స్లో మరింత ప్రతిభ కనబరచాలని ప్రోత్సహించారు. విజయవంతంగా ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు కరాటే మరియు తైక్వాండోలో తదుపరి బెల్ట్ స్థాయికి పదోన్నతి పొందారు. విద్యార్థులకు ప్రిన్సిపాల్ మరియు ఒకినావా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ చీఫ్ ఇన్స్ట్రక్టర్ శ్రీ కె. వసంత్ కుమార్ బ్లాక్ బెల్ట్ 8వ డాన్ చేతుల మీదుగా బెల్ట్లు మరియు సర్టిఫికెట్లు అందచేసి గౌరవించారు.ఛైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ కరాటే పిల్లల్లో శారీరక దృఢత్వం మాత్రమే కాకుండా మానసిక క్రమశిక్షణ మరియు ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది. ఇది జీవిత సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది అని వివరించారు.ప్రిన్సిపాల్ మాట్లాడుతూ మార్షల్ ఆర్ట్స్ విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇది ఏకాగ్రతను పెంచి ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహిస్తుంది. మా విద్యార్థుల విజయంపై మేము గర్విస్తున్నాము అని తెలిపారు. చీఫ్ ఇన్స్ట్రక్టర్ శ్రీ కె. వసంత్ కుమార్ మాట్లాడుతూ,కరాటే అనేది ఒక జీవన విధానం. ఇది స్వీయరక్షణ, గౌరవం మరియు పట్టుదలను నేర్పుతుంది. నిరంతర సాధనతో పిల్లలు శారీరకంగా మరియు మానసికంగా బలంగా మారుతారు.అనిఅన్నారు ఈ కార్యక్రమం విద్యార్థుల ప్రతిభను ప్రదర్శిస్తూ విజయవంతంగా ముగిసింది.
Admin
DNB News