DNB News - తెలంగాణ / : మండల పరిధిలోని నర్సింహాపురం గ్రామం లో ఉన్న శ్రీ కోదండరామ స్వామి దేవాలయం లో ఉన్న శ్రీ రామానుజాచార్యుల. స్వయంభు.విగ్రహానికి. తదుపరి. ఉత్సవ విగ్రహానికి. దేవాలయం లో. బొడ్డు మండపం. పై ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ ముడుంబై శేషాచార్యులు ఆధ్వర్యంలో. స్వామి వారికి. ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఇట్టి కార్యక్రమం లో. గ్రామ సర్పంచ్ డాక్టర్ వేమూరి సత్యనారాయణ పాల్గొని. ప్రత్యేక పూజలు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. తదుపరి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా సర్పంచ్ సత్యనారాయణ మాట్లాడుతూ. తమ ఇంటి వేమూరి వారి వంశ కుల దైవం అయిన. శ్రీ రామానుజాచార్యుల స్వామి వారి విగ్రహానికి నిత్యం పూజలు నిర్వహించడం. అలాగే వారి. 1009 వ జయంతి సందర్భంగా వారికి. పూజలు అభిషేకాలు నిర్వహించే. అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని. అలాగే. రామానుజాచార్యుల స్వామి వారు వేదానికి సరైన అర్థం చెప్పి. విశిష్టద్వైత గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన మహానీయుడని గొప్ప వైష్ణవ తత్వవేత్త సంఘసంస్కర్త అని ఆయన భక్తి మార్గం కుల రహిత సమాజం మరియు ఈశ్వర ప్రవర్తి కోసం జీవితాంతం కృషి చేశారని సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన కృషి అమోఘమని కర్తవ్య దీక్ష లో ఆయన అనుసరించిన పద్ధతి. నేటి సమాజానికి యువతకు. ఆదర్శమని ప్రతి ఒక్కరు. రామానుజాచార్యుల సిద్ధాంతాలను పాటించాలని అన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ ముడుంబై శేషాచార్యులు. శ్రీ ముడుంబై. లవకుశ చార్యులు. వీరబోయిన వినోద్. బారి లక్ష్మయ్య వీరబోయిన వెంకన్న కోండ్రు గోపినాథ్ గంగూరి సంతోష్ కుమార్. కనపర్తి శ్రీనివాసరావు. తదితర గ్రామాలకు చెందిన భక్తులు పాల్గొన్నారు
Admin
DNB News