DNB News - తెలంగాణ / : జయశంకర్ భూపాలపల్లి జిల్లా: రేగొండ మండలంలో శనివారం అర్ధరాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది.వివాహేతర సంబంధం పెట్టుకున్న తండ్రిని కొడుకులు చంపిన ఘటన భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో శనివారం అర్ధరాత్రి జరిగింది. వారి రేపాక గ్రామానికి చెందిన కుర్రె చేరాలు గ్రామం లో ఒంటరిగా ఉండగా, అతని భార్య కుమారుల వద్ద హైదరాబాద్లో ఉంటోంది. ఈక్రమంలో కుమారులు గ్రామానికి రాగా మరో మహిళతో గమినించి దాడి చేసినట్లు సమాచారం. చేరాలకు తీవ్ర గాయాలు కావడంతో ఎంజీఎంకు తరలించిన చికిత్స పొందుతూ మృతి చెందాడు. మర్డర్ జరిగిన విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. మహిళా పరకాల హాస్పిటల్లో చికిత్స పలుతున్నట్లు సమాచారం. చేరాలకు భార్య సులోచన, కూతుళ్లు సరిత, సౌజన్య, కొడుకులు రామ్, లక్ష్మణ్ ఉన్నారు.
Admin
DNB News