DNB News - తెలంగాణ / : రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన మిర్యాల బాలరాజు (39) అనే చేనేత కార్మికుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. చేనేత పనుల కోసం ఐదేళ్ల క్రితం భువనగిరిలోని ఒక ప్రైవేటు సంస్థ వద్ద నుంచి రూ.3 లక్షల 50 వేల రుణం తీసుకున్నాడు. దీనికి ప్రతి నెలా ఈఎంఐలు చెల్లిస్తూ వచ్చాడు. అయితే గత రెండు నెలలుగా పని లేకపోవడంతో ఈఎంఐలు చెల్లించలేకపోయాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలరాజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
Admin
DNB News