DNB News - తెలంగాణ / : వరంగల్ జిల్లా: నెక్కొండ మండలం పత్తిపాక తండాకు చెందిన బి.స్నితిక (14) అనారోగ్యంతో శనివారం ఉదయం మృతి చెందింది. సాగర్ -వాణి దంపతులు తమ పిల్లల చదువుల కోసం హనుమకొండలో నివసిస్తున్నారు. వీరి కుమార్తె స్నితిక హంటర్ రోడ్డులోని ఓ ప్రైవేటు పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను మెరుగైన చికిత్స కోసం HYDలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది.
Admin
DNB News