DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు జిల్లా రహదారి ప్రమాదాల నియంత్రణే ప్రధాన లక్ష్యమని, ట్రాఫిక్ నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ పేర్కొన్నారు. ప్రతి శనివారం రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీసు అధికారులకు ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఆయా పోలీస్ స్టేషన్ పరిధుల్లో అధికారులు ప్రజలతో సమావేశాలు నిర్వహించి రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అతివేగంగా వాహనాలు నడపరాదని, ఓవర్లోడ్తో ప్రయాణించరాదని, మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని ప్రజలకు వివరించారు. 2026 జనవరి 1 నుండి మే 31 వరకు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఈ-చలాన్లు, కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. నమోదైన చర్యలు: • ఓవర్ స్పీడ్ కేసులు – 3,732 * హెల్మెట్ లేకుండా వాహనం నడిపిన వారు – 2,914 * సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసిన వారు – 863 * డ్రంకెన్ డ్రైవింగ్ కేసులు – 3,803 * ఓపెన్ డ్రింకింగ్ కేసులు – 7,244 ట్రాఫిక్ నిబంధనలను పాటించడం ద్వారా తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడవచ్చని ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Admin
DNB News