DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 103వ జన్మదిన వేడుకలు గురువారం కర్నూలు కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి, ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచారని, ప్రజా సేవలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Admin
DNB News