DNB News - ఆంధ్రప్రదేశ్ / : రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్ కొరత ఉందని అసత్య ప్రచారం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడానికి ప్రయత్నిస్తున్న ఎస్వి మోహన్ రెడ్డి వ్యాఖ్యలను కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో ఎక్కడా ఇంధన కొరత లేదని స్పష్టం చేశారు. అయినప్పటికీ రాజకీయ లాభాల కోసం, కూటమి ప్రభుత్వం పై బురద జల్లాలని లక్ష్యంతో ఉద్దేశపూర్వకంగా అబద్ధాలను ప్రచారం చేయడం అత్యంత దుర్మార్గమైన రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. ప్రజల్లో గందరగోళం సృష్టించి స్వార్థ ప్రయోజనాలు పొందాలని చూస్తున్న ఇలాంటి నాయకులు వెంటనే తమ వైఖరిని మార్చుకోవాలని, లేకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. నిజాలను వక్రీకరించి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలను ఇకపై సహించబోమని స్పష్టం చేశారు
Admin
DNB News