Thursday, 23 April 2026 04:06:34 PM
# సూర్యాపేట్ జిల్లా నడిగూడెం మండలం కార్యాలయంలో పార్టీ కార్యకర్తలతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న - బొల్లం మల్లయ్య యాదవ్ # శ్రీ భగీరథ మహర్షి ఆశయాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం... జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జ్యోతి # శాంతియుత వాతావరణంతో పరిశుభ్రమైన నగరంగా ఆదర్శంగా ఖమ్మం నిలిచేలా చర్యలు # కోదాడ ఆర్టీసీ డిపో వద్ద తమ సమస్యల పరిష్కారానికి సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలపడం జరిగింది. # శ్రీ రామానుజాచార్యుల 1009 జయంతి సందర్భంగా. ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించిన. గ్రామ సర్పంచ్ డాక్టర్ వేమూరి సత్యనారాయణ. # తెలంగాణ వడ్డెర సంఘం అండ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మునగాల మండలం నాయకులు గోగుల లక్ష్మణ్ వడ్డెర చైతన్య యాత్ర # నషా ముక్త్ భారత్ అవగాహన వాకథాన్‌లో కలెక్టర్, ఎస్పీ పాల్గొనడం... # జస్టిస్ పిసీ ఘోష్ కమిషన్ పై హైకోర్టు తీర్పుతో న్యాయం గెలిచింది # ఉపాధి హామీ చట్టం కూలీలకు వరం లాంటిది జి రాంజీ పథకం కూలీలకు వ్యతిరేకమైనది జి రామ్ జి రద్దుకై ఉద్యమిద్దాం ములకలపల్లి రాములు పిలుపు # జగన్నాధపురం గ్రామంలో పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమం.. # విజయలక్ష్మి సమేత కనకదుర్గా దేవాలయం వావిలాలపల్లి, కరీంనగర్ సధ్వజ పరివార స్థిర ప్రతిష్టా మహోత్సవం # ​లైసెన్స్ లేకుండా టీవీఎస్ ఎక్స్‌ఎల్ నడిపితే చర్యలు: 140 వాహనాల సీజ్ - ట్రాఫిక్ ఏసీపీ యాదగిరిస్వామి # ఖమ్మం జిల్లా పేదప్రజలకు అండగా శ్రీచక్ర హాస్పిటల్. # డ్రాయింగ్ బుక్స్, స్కెచ్ పెన్నులు , కుక్కర్ ను అందించిన కార్పొరేటర్ మాసం గణేష్ # నగరంలోని అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి.-తుమ్మల నాగేశ్వరరావు # ఆదోని మేక వంక ఆక్రమణలపై ఆగ్రహం – సిమెంట్ కాలువ తొలగించాలంటూ నూర్ అహ్మద్ డిమాండ్... # పత్తికొండలో OHSR ట్యాంక్ పరిశీలన – నీటి నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టిన జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి... # ఎన్.టి.ఎల్. సంస్థ ఆధ్వర్యంలో ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో 19000/ వేలరూపాయల నిత్యవసర సరుకులు అందజేత # నంద్యాలలో SDPI లీడర్స్ కాన్క్లేవ్ – ఆదోని యూనిట్ చురుకైన భాగస్వామ్యం.. # చైన్ స్నాచింగ్ కేసు ఛేదన – నిందితుడి అరెస్ట్, పల్సర్ బైక్ స్వాధీనం..

చైన్ స్నాచింగ్ కేసు ఛేదన – నిందితుడి అరెస్ట్, పల్సర్ బైక్ స్వాధీనం..

Date : 22 April 2026 11:42 AM Views : 9

DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు గుత్తి పరిధిలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ నెల 9వ తేదీ రాత్రి గుత్తి పట్టణంలోని పెట్రోల్ బంక్ సమీప సాయినాథ్ నగర్‌లో ఓ వివాహిత మెడలో నుంచి ఇద్దరు దుండగులు బంగారు గొలుసును లాక్కొని పరారయ్యారు. అదే రోజు సంతోష్ నగర్‌లో ఓ వృద్ధురాలిని కత్తితో బెదిరించి ఆమె మెడలోని గొలుసును దోచుకుని పారిపోతుండగా, స్థానికులు స్పందించడంతో నిందితులు మోటార్ సైకిల్‌ను అక్కడే వదిలి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలాలను పరిశీలించి, మోటార్ సైకిల్, మొబైల్ ఫోన్ సహా పలు ఆధారాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. టెక్నికల్ ఆధారాల సహాయంతో నిందితులు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన భవారియా గ్యాంగ్ సభ్యులు మానవ్, హరి ప్రకాష్‌లుగా గుర్తించారు. వారిలో మానవ్‌ను బాలాజీ నగర్‌లో అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి దొంగిలించిన బంగారు గొలుసు ముక్కను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. నిందితులు ముందుగా బెంగుళూరు నుంచి అనంతపురం చేరుకుని, అక్కడ పల్సర్ మోటార్ సైకిల్‌ను దొంగిలించి కర్నూలులో చైన్ స్నాచింగ్‌కు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. పరారీలో ఉన్న మరో నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. ఈ కేసు ఛేదనలో సీఐ విక్రమ్ సింహ, ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్ఐ గోపి, పీసీలు మురళి, సుబ్బారాయుడు తదితరులు కీలక పాత్ర పోషించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :