Tuesday, 15 September 2026 11:47:35 PM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

మాజీ మంత్రి జోగి రమేష్ ను పరామర్శించిన మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం

Date : 23 February 2026 02:12 PM Views : 466

DNB News - ఆంధ్రప్రదేశ్ / : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జోగి రమేష్‌ను మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆదివారం ఇబ్రహీంపట్నంలోని ఆయన స్వగృహంలో పరామర్శించారు.కూటమి ప్రభుత్వ ప్రతీకార చర్యల వల్ల జోగి రమేష్ మరియు ఆయన కుటుంబ సభ్యులు పడిన ఆవేదనను, ఎదుర్కొన్న ఇబ్బందులను ఈ సందర్భంగా తమ్మినేని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించే హక్కు తమకు ఉందని, కానీ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురి చేస్తోందని మండిపడ్డారు. తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో అనవసర రాద్ధాంతం చేసి ప్రభుత్వం అబాసుపాలైందని, అలాగే ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నాలను జోగి రమేష్ సమర్థవంతంగా ఎండగట్టారని గుర్తు చేశారు. ఈ కారణంతోనే ఆయనను టార్గెట్ చేస్తూ 'రెడ్ బుక్' రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని, డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడితే కూటమి సర్కార్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, జోగి రమేష్ కుటుంబానికి వైఎస్సార్సీపీ శ్రేణులన్నీ అండగా ఉంటాయని తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి దుంపల రామారావు సంయుక్త కార్యదర్శి గుమ్మడి రాంబాబు రణస్థలం ఎంపీపీ పిన్నింటి సాయి రాష్ట్రా ఇంటలెక్చువల్ కార్యదర్శి పిల్లల రామకృష్ణ కొత్తూరు మాజీ పి ఏ సి ఎస్ అధ్యక్షులు చింతాడ సూర్యనారాయణ తదితరులు పాల్గున్నారు

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :