DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణంలో అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసిన కామత్ డెంటల్ వైద్యశాలను ఈరోజు ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజలకు నాణ్యమైన దంత వైద్య సేవలు అందించేందుకు ఇలాంటి ఆధునిక వైద్యశాలలు అవసరమని పేర్కొన్నారు. ఆదోని మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు ఈ వైద్యశాల ద్వారా మెరుగైన చికిత్స అందుబాటులోకి రావడం ఆనందదాయకమని తెలిపారు. వైద్యశాల నిర్వాహకులు డాక్టర్ రవి కిరణ్, డాక్టర్ సంధ్యారాణి మాట్లాడుతూ, అత్యాధునిక పరికరాలతో అన్ని రకాల దంత చికిత్సలను ఒకే చోట అందించే విధంగా ఈ వైద్యశాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సామాన్య ప్రజలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించడమే తమ లక్ష్యమని చెప్పారు. ఈ సేవలను ఆదోని పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి కోరారు.
Admin
DNB News