DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణంలోని శ్రీనివాస భవన్ సర్కిల్ వద్ద పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలు, రోడ్డు ప్రమాదాలను నివారించాలనే ఉద్దేశంతో అక్కడ తక్షణమే ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ ఆదోని నియోజకవర్గ అధ్యక్షుడు అమ్లివాలే ఫయాజ్ బాషా డిమాండ్ చేశారు. ఈ మేరకు బీఎస్పీ నాయకులు సబ్ కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. శ్రీనివాస భవన్ సర్కిల్ పరిసర ప్రాంతాల్లో షాపింగ్ మాల్స్, వ్యాపార సముదాయాలు అధికంగా ఉండటంతో నిత్యం ట్రాఫిక్ రద్దీ నెలకొంటోందని, దీనివల్ల వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిప్యారు. ముఖ్యంగా విద్యార్థులు, మహిళలు, వృద్ధులు రోడ్డు దాటడంలో ప్రమాద పరిస్థితులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యపై అధికారులు తక్షణమే స్పందించి ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన నియంత్రణ చర్యలు చేపట్టాలని కోరారు.
Admin
DNB News