DNB News - ఆంధ్రప్రదేశ్ / : 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా కర్నూలు జిల్లా కలెక్టరేట్ నుంచి వాకథాన్ (WALKTHON) ర్యాలీని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి గారు, జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రహదారి భద్రతపై ప్రజలందరికీ అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, సీటుబెల్ట్ వినియోగించాలి, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని సూచించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ రహదారి ప్రమాదాలను తగ్గించడంలో ప్రతి పౌరుడి బాధ్యత కీలకమని పేర్కొన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా అనేక ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు. ఈ వాకథాన్ ర్యాలీలో జిల్లా అధికారులు, పోలీసు అధికారులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
DNB News