Saturday, 19 September 2026 08:34:00 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

రాయలసీమ ద్రోహి చంద్రబాబు గో బ్యాక్ – విద్యార్థి సంఘాల ఘాటు హెచ్చరిక..

Date : 05 February 2026 03:05 PM Views : 138

DNB News - ఆంధ్రప్రదేశ్ / : రాయలసీమ ప్రాంత ప్రజల ఆకాంక్షలను, విద్యార్థుల డిమాండ్లను పూర్తిగా విస్మరిస్తూ వ్యవహరిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాయలసీమకు ద్రోహం చేస్తున్నారని వివిధ విద్యార్థి సంఘాలు తీవ్రస్థాయిలో విమర్శించాయి. “రాయలసీమ ద్రోహి చంద్రబాబు గో బ్యాక్” అంటూ నినాదాలు చేస్తూ విద్యార్థి సంఘాలు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. అనంతరం ఆదోనిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో AISF జిల్లా ప్రధాన కార్యదర్శి షబీర్ భాష, BDSF రాష్ట్ర కార్యదర్శి రమేష్, PDSU రాష్ట్ర కోశాధికారి సోమశేఖర్, DSF రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్, PDSO రాష్ట్ర నాయకుడు తిరుమలేష్ మాట్లాడుతూ— ఆదోనిని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని గత కొన్ని రోజులుగా విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాలు ఉద్యమాలు చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం అత్యంత విడ్డూరమని అన్నారు. అలాగే ఆరెకల్ సమీపంలో ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలను పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అనేక కార్యక్రమాలు చేపట్టినా ప్రభుత్వానికి చీమకుట్టినట్టుగా కూడా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు , అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు రాయలసీమకు ఏమి చేశారని ముక్కుసూటిగా ప్రశ్నించారు. రాయలసీమ పశ్చిమ ప్రాంత అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ, ఆదోని జిల్లాగా ప్రకటించకపోవడం, మెడికల్ కళాశాలను ప్రభుత్వాధీనంలోకి తీసుకోకపోవడం, నూతన జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం వంటి అంశాలు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ డిమాండ్లు నెరవేర్చకుండా ముఖ్యమంత్రి రాయలసీమ ప్రాంతంలో అడుగు పెట్టే నైతిక హక్కు లేదని విద్యార్థి సంఘాలు హెచ్చరించాయి.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :