DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు జిల్లాకు చెందిన అడ్వకేట్ ఎం. పవన్ కుమార్ (ఎపీ 1956/2013), కర్నూలు బార్ అసోసియేషన్లో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. గురువారం రాత్రి జిల్లా పోలీసు కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుస్సేన్ పీరా కు వినతి పత్రం అందజేశారు. తన వినతి పత్రంలో 21.02.2026 తేదీన కర్నూలు నాల్గవ పట్టణ సిఐ విక్రమ సింహా తో తనకు ఏర్పడిన సమస్యను ఇరువురూ పరస్పర చర్చల ద్వారా సఖ్యంగా పరిష్కరించుకున్నామని తెలిపారు. ఈ విషయానికి సంబంధించి ఎవరి ప్రమేయం గానీ, ప్రోద్బలం గానీ లేదని స్పష్టం చేశారు. అలాగే తన ఆరోగ్య పరిస్థితి అనుకూలంగా లేని సమయంలో తాను, తన భార్య కలిసి పై సమస్యను పరిష్కరించుకున్న విషయాన్ని మీడియా ద్వారా వెల్లడించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఎవరి మీద కూడా ఎటువంటి చర్యలు తీసుకోకూడదని లిఖితపూర్వకంగా అడిషనల్ ఎస్పీ అడ్మిన్కు వినతి పత్రం ద్వారా విజ్ఞప్తి చేశారు. జిల్లా పోలీసు కార్యాలయం, కర్నూలు
Admin
DNB News