DNB News - ఆంధ్రప్రదేశ్ / : యోగి వేమన విశ్వవిద్యాలయం నుండి జర్నలిజం విభాగంలో రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా రెండు స్వర్ణ పతకాలు అందుకున్న ఎస్.కే. తస్లీమాను ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వయంగా ఆమె నివాసానికి వెళ్లి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. తస్లీమా ఒక అమ్మాయిగా ఎన్నో కష్టాలు పడుతూ, రాత్రింబవళ్లు శ్రమించి రెండు గోల్డ్ మెడల్స్ సాధించడం గొప్ప విషయం అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆమె విజయంలో తల్లిదండ్రుల ప్రోత్సాహం, కృషి ఎంతో ముఖ్యమని చెప్పి వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. అలాగే మైనారిటీ సమాజంలోని బాలికలను ప్రతి ఒక్కరూ విద్యాభ్యాసం చేయించాలని ఆకాంక్షించారు. జర్నలిజం రంగంలోకి అడుగుపెట్టిన తస్లీమా తన గళం, తన కలం ద్వారా మహిళల అభ్యున్నతికి, సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై ధైర్యంగా పోరాడాలని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు.
Admin
DNB News