DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని మండలం నారాయణపురం గ్రామ సచివాలయం వద్ద ఉపాధి హామీ కూలీల సమస్యల పరిష్కారం కోసం రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి, అనంతరం సచివాలయ అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కే వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆదోని మండలంలో ఉపాధి పనులు లేకపోవడంతో పెద్ద ఎత్తున కూలీలు వలసలు వెళుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా తీసుకొచ్చిన “వివిజి రాంజీ” పథకం కారణంగా ఉపాధి కూలీలకు అధికారులు సక్రమంగా పనులు కల్పించడం లేదన్నారు. ప్రధానంగా ఫేస్ యాప్ విధానం వల్ల ఉపాధి కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పనిచేసిన కూలీలకు నెలల తరబడి వేతనాలు చెల్లించకపోవడంతో అప్పుల పాలవుతున్నారని విమర్శించారు. గ్రామాల్లో ఉపాధి పనులు సక్రమంగా కల్పించకపోవడం వల్లే వలసలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఫేస్ యాప్ను రద్దు చేసి పాత విధానంలోనే వేతనాలు చెల్లించాలని, పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలని, వివిజి రాంజీ పథకాన్ని రద్దు చేసి ఉపాధి హామీ చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు కలిసి పెద్ద ఎత్తున పోరాటాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు తయన్నతో పాటు ఉపాధి కూలీలు పాల్గొన్నారు.
Admin
DNB News