DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో డీఆర్వో ఆధ్వర్యంలో అమరావతి రాజధాని సంబరాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది చేతుల్లో దీపాలతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి అమరావతి పట్ల తమ మద్దతును తెలియజేశారు. “Celebrating Amaravati – Our Permanent Capital” అనే సందేశంతో ఏర్పాటు చేసిన బ్యానర్ ముందు దీపాలు వెలిగిస్తూ కార్యక్రమం జరిగింది. అమరావతి రాష్ట్ర ప్రజల ఆకాంక్షల ప్రతీకగా నిలుస్తుందని, రాష్ట్ర అభివృద్ధికి కీలక కేంద్రంగా అవతరిస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొని సంబరాలను ఉత్సాహంగా జరుపుకున్నారు.
Admin
DNB News