DNB News - ఆంధ్రప్రదేశ్ / : రంజాన్ పండుగను పురస్కరించుకుని కర్నూలు జిల్లా వ్యాప్తంగా పోలీసులు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు శనివారం దర్గా, మసీదులు, ఈద్గాల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. పోలీసు అధికారులు డీఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు మరియు సిబ్బంది సమన్వయంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ముఖ్య ప్రాంతాల్లో నిఘాను పెంచి, అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులపై ప్రత్యేక దృష్టి సారించారు. బాంబు స్క్వాడ్ బృందాలు, పోలీసు జాగిలాలతో కలిసి విస్తృత తనిఖీలు నిర్వహించి భద్రతను మరింత బలోపేతం చేశారు. పండుగ సందర్భంగా ప్రజల రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు అప్రమత్తంగా ఉండి బందోబస్తు విధులు నిర్వర్తిస్తున్నారు. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టి, ప్రజల రాకపోకలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నారు.
Admin
DNB News