Friday, 17 April 2026 08:08:31 PM
# జీఎస్టీ అమలు సమన్వయంపై కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం # రాయలసీమ సాగునీటి హక్కుల కోసం వైఎస్ఆర్సీపీ సమాలోచన సమావేశం # కేంద్ర మంత్రి బండి సంజయ్ ని కలిసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం # విద్యార్థుల ప్రాణాలతో ఆటలాడుతున్న స్కూల్ యాజమాన్యం – ఇంకా చర్యలు ఎందుకు లేవు?”.. # అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి # ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. # టి డి పి రాష్ట్ర అధ్యక్షులుగా రెండవసారి నియమితులైన పల్లా శ్రీనివాసరావు సన్మానించి, శుభాకాంక్షలు తెలిపిన బొండా యల్లాజీరావు, శ్రీదేవి లు # శాతవాహన అభివృద్ధికి కృషి - నూతన కార్యనిర్వాహక మండలి సభ్యులు # కాంగ్రెస్ సీనియర్ మైనార్టీ మహిళా నాయకురాలు సమాన మహమ్మద్ # గోడౌన్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు.. # ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి లో ఫ్రీజర్ పని చేయక పోవడం తో చనిపోయిన వారు పరిస్థితి దారుణం # తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు లో ఓ ఇంట్లో చోరీ # బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా భాషబోయిన ప్రదీప్ యాదవ్ నియామకం # ఘనంగా కిసాన్ నగర్ హిందూ సమ్మేళనం # ప్రాణహాని బెదిరింపుల నేపథ్యంలో పోలీసు రక్షణ కోరిన బి. జాఫర్.. # “మీ రక్షణ – మా బాధ్యత” అవగాహన ర్యాలీకి శ్రీకారం – మహిళల భద్రతపై కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ పిలుపు.. # 10 సూత్రాల అమలుపై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి.. # సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ # ఆకుపాముల గ్రామంలోని మాంటిస్సోరీ పాఠశాలలో "సురక్షితంగా ఇంటికి చేరుదాం ‘Arrive and Alive’" అవగాహన కార్యక్రమం # కొత్తగూడెం అరైవ్ అలైవ్ - రోడ్ సేఫ్టీ కార్యక్రమం

విద్యార్థుల ప్రాణాలతో ఆటలాడుతున్న స్కూల్ యాజమాన్యం – ఇంకా చర్యలు ఎందుకు లేవు?”..

Date : 17 April 2026 06:04 PM Views : 16

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణంలో ఉన్న శ్రీ బాలాజీ విద్యానికేతన్ స్కూల్‌లో జరిగిన ప్రమాద ఘటనకు 15 రోజులు గడిచినా ఇప్పటివరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకపోవడం పట్ల ఆర్‌పీఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి షాహిద్ అఫ్రీది, జిల్లా కార్యదర్శి ప్రదీప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల స్కూల్ భవనంలో పెచ్చులు ఊడి పడిన ఘటనలో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై జిల్లా విద్యాశాఖ అధికారి (డిఈఓ) స్వయంగా విచారణ చేసినప్పటికీ, ఇప్పటివరకు కేవలం నోటీసులకే పరిమితమై చర్యలు తీసుకోకపోవడం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమని వారు విమర్శించారు. స్కూల్ భవనం పూర్తిగా స్విథిలావస్థలో ఉన్నప్పటికీ యాజమాన్యం ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్ల భవిష్యత్తులో మరిన్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు. గతంలో కర్నూలు నగరంలో గోడ కూలి ఒక విద్యార్థి మృతి చెందిన ఘటనలో వెంటనే స్కూల్‌ను సీజ్ చేసిన అధికారులు, ప్రస్తుతం ఆదోనిలో జరిగిన ఘటనపై ఎందుకు ఆలస్యం చేస్తున్నారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఇప్పటికైనా డిఈఓ మరియు ఆర్‌జేడీ వెంటనే స్పందించి శ్రీ బాలాజీ విద్యానికేతన్ స్కూల్‌ను సీజ్ చేసి విద్యార్థుల ప్రాణాలను కాపాడాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రోషన్, చిన్న, రాజు తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :