DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణంలో ఉన్న శ్రీ బాలాజీ విద్యానికేతన్ స్కూల్లో జరిగిన ప్రమాద ఘటనకు 15 రోజులు గడిచినా ఇప్పటివరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకపోవడం పట్ల ఆర్పీఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి షాహిద్ అఫ్రీది, జిల్లా కార్యదర్శి ప్రదీప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల స్కూల్ భవనంలో పెచ్చులు ఊడి పడిన ఘటనలో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై జిల్లా విద్యాశాఖ అధికారి (డిఈఓ) స్వయంగా విచారణ చేసినప్పటికీ, ఇప్పటివరకు కేవలం నోటీసులకే పరిమితమై చర్యలు తీసుకోకపోవడం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమని వారు విమర్శించారు. స్కూల్ భవనం పూర్తిగా స్విథిలావస్థలో ఉన్నప్పటికీ యాజమాన్యం ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్ల భవిష్యత్తులో మరిన్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు. గతంలో కర్నూలు నగరంలో గోడ కూలి ఒక విద్యార్థి మృతి చెందిన ఘటనలో వెంటనే స్కూల్ను సీజ్ చేసిన అధికారులు, ప్రస్తుతం ఆదోనిలో జరిగిన ఘటనపై ఎందుకు ఆలస్యం చేస్తున్నారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఇప్పటికైనా డిఈఓ మరియు ఆర్జేడీ వెంటనే స్పందించి శ్రీ బాలాజీ విద్యానికేతన్ స్కూల్ను సీజ్ చేసి విద్యార్థుల ప్రాణాలను కాపాడాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రోషన్, చిన్న, రాజు తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News