DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని మున్సిపల్ కమిషనర్ నయీం అహ్మద్ గురువారం మున్సిపల్ ఏఈ మరియు డీఈలతో కలిసి బాసపురం వాటర్ పంప్ హౌస్తో పాటు ఎస్.ఎస్ కెనాల్ను సందర్శించి పరిశీలించారు. పంప్ హౌస్ పనితీరు, నీటి పంపిణీ విధానం, నిర్వహణ అంశాలను అధికారులతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పట్టణ ప్రజలకు తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. పంపింగ్ వ్యవస్థను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, సాంకేతిక సమస్యలు తలెత్తిన వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మున్సిపల్ శాఖ నిరంతరం చర్యలు చేపడుతోందన్నారు.
Admin
DNB News