DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణంలోని 5వ వార్డ్ విజయనగర్ కాలనీలో కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడం ద్వారా స్థానిక ప్రజలకు ఉపశమనం కలిగింది. గత కొంతకాలంగా APHB (HIG, MIG, LIG) కాలనీల్లో అధిక లోడ్ కారణంగా విద్యుత్ అంతరాయాలు ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై కాలనీ నివాసితులు కలిసి APSPDCL అధికారులకు వినతి పత్రం సమర్పించగా, వారు వెంటనే స్పందించి టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులను ప్రారంభించారు. కాంట్రాక్టర్ సి. రంగస్వామి మరియు విద్యుత్ శాఖ సిబ్బంది, 5వ వార్డ్ టీడీపీ ఇంచార్జ్ అమర్ ప్రకాష్ సమన్వయంతో వారం రోజుల పాటు పనులు నిర్వహించి, మే 1వ తేదీ సాయంత్రం ట్రాన్స్ఫార్మర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా NDA కూటమి తరఫున శ్రీ కె. మీనాక్షి నాయుడు సహకారంతో పాటు ఉమాపతి, భూపాల్, 5వ వార్డ్ టీడీపీ ఇంచార్జ్ అమర్ ప్రకాష్ మరియు కాలనీ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ విద్యుత్ శాఖ సిబ్బంది, కాంట్రాక్టర్కు కృతజ్ఞతలు తెలియజేశారు.
Admin
DNB News