DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ ఆధ్వర్యంలో ఈ రోజు కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ నూతన కమిటీ సమావేశం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ముందుగా పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించిన అనంతరం సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ, ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్తో పాటు ఉపాధ్యక్షులు సోమిశెట్టి శ్రీకాంత్, బి. చంద్రశేఖర్, కె. సాంబశివా రెడ్డి, బి. పి. బసవరాజు, కె. రంగన్న, జి. అశోక్ కుమార్ యాదవ్, కార్యనిర్వాహక కార్యదర్శులు షేక్ జకియా అక్సారి, కె. అక్షయ కుమారి, కురువ మద్దిలెటి, వి. రామకృష్ణ నాయుడు, బి. అంజనయ్య, బి. హెల్తప్ప, అధికార ప్రతినిధులు బోయ మధుసూధన్ నాయుడు, వెంకట కృష్ణ నాయుడు, బందే నవాజ్, ఎన్. శశిరేఖ, బి. అంజినమ్మ, హెచ్. నరసప్ప, పి. సురేష్, కార్యదర్శులు గడ్డం హైమావతి, బోయ రాధమ్మ, ఖలందర్ బాషా, పి. సుభాన్ బీ, గూడూరు పద్మావతి, సంగిపోగుల వీరేష్, కోశాధికారి బి. రవి, కార్యాలయ కార్యదర్శి వి. రాజశేఖర్ రెడ్డి, మీడియా కోఆర్డినేటర్ ఇ. మల్లికార్జున గౌడ్ తదితరులు హాజరయ్యారు. సమావేశానికి హాజరైన సభ్యులు పరస్పరం పరిచయం చేసుకుని పార్టీ బలోపేతానికి సంబంధించిన పలు సూచనలు చేశారు. పార్టీ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా నిర్వహించాలనే దిశగా చర్చ జరిగింది.
Admin
DNB News