Sunday, 02 August 2026 10:48:44 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

హెల్మెట్ ప్రాణరక్షణకు కవచం – ఎస్పీ విక్రాంత్ పాటిల్ చేతుల మీదుగా అవగాహన ర్యాలీ ప్రారంభం..

Date : 08 April 2026 06:03 PM Views : 95

DNB News - ఆంధ్రప్రదేశ్ / : రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ పేర్కొన్నారు. బుధవారం కిమ్స్ హాస్పిటల్స్, కర్నూలు న్యూరోసర్జరీ విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ న్యూరోసర్జన్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన హెల్మెట్ అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించారు. యముడి వేషధారణతో నిర్వహించిన ఈ వినూత్న ర్యాలీ రాజ్ విహార్ సర్కిల్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు సాగింది. హెల్మెట్ లేని ద్విచక్ర వాహనదారులకు ఎస్పీ చేతుల మీదుగా ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వేగం నియంత్రణ, మద్యం సేవించి వాహనం నడపకపోవడం, ట్రాఫిక్ నియమాలు పాటించడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చన్నారు. జరిమానా కోసం కాదు, ప్రాణ రక్షణ కోసం హెల్మెట్ తప్పనిసరి అని స్పష్టం చేశారు. ద్విచక్ర వాహనం నడిపే వారు మాత్రమే కాకుండా వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్ ధరించాలని సూచించారు. రోడ్డు మీద బాధ్యతాయుతంగా వ్యవహరిస్తేనే ప్రమాదాలను నివారించవచ్చన్నారు. అనంతరం న్యూరోసర్జన్ డా. సుమంత్ కుమార్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా తలకు గాయాలు అవుతాయని తెలిపారు. తలకు గట్టి దెబ్బ తగిలితే మెదడు, వెన్నెముకపై తీవ్ర ప్రభావం చూపుతుందని, కొన్ని సందర్భాల్లో శాశ్వత వికలాంగత లేదా మరణం సంభవించే ప్రమాదం ఉందన్నారు. హెల్మెట్ ధరించడం ద్వారా ఈ ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించడం, అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వడం వంటి ప్రాథమిక చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల్లో ఫస్ట్ ఎయిడ్‌పై అవగాహన పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కిమ్స్ కర్నూలు ఏవీపీ డా. ఆదిత్య, మార్కెటింగ్ జీఎం ఆనంద్, న్యూరోసర్జరీ విభాగం వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది, విద్యార్థులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: