DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఎస్సీ, ఎస్టీ (అత్యాచార నిరోధక) చట్టం అమలు పై జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ వర్గాలపై జరిగే అత్యాచార ఘటనలను అరికట్టేందుకు చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. నమోదైన కేసుల పురోగతి, బాధితులకు అందిస్తున్న ఆర్థిక సహాయం, పునరావాస చర్యలు తదితర అంశాలను సమీక్షించారు. బాధితులకు ప్రభుత్వ పరంగా అందాల్సిన సహాయాన్ని ఆలస్యం లేకుండా అందించాలని సూచించారు. అలాగే ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి చట్టం గురించి విస్తృత ప్రచారం చేయాలని తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో హౌసింగ్ పీడీ చిరంజీవి, కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, పత్తికొండ ఆర్డీఓ భరత్ నాయక్ తదితర అధికారులు పాల్గొన్నారు.
Admin
DNB News