DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆముదాలవలస నియోజకవర్గం లో బూర్జ మండలంలోని గుత్తావిల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద ఇంటింటికీ పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఈ రోజు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆమదాలవలస నియోజకవర్గ శాసనసభ్యులు మరియు రాష్ట్ర పియుసి చైర్మన్ శ్రీ కూన రవికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు ఇంటి వద్దకే వెళ్ళి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం పట్ల కట్టుబడి ఉందని, అర్హులందరికీ న్యాయం జరిగేలా సంక్షేమ పథకాలను పార్టీలకు అతీతంగా పారదర్శకంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు, విడో మహిళలకి అనేక వర్గాలకు ప్రభుత్వం చేయూతనిస్తోందని పేర్కొన్నారు. ప్రజలకు ప్రభుత్వం అన్ని వేలలు అండగా ఉంటుందని, ఎవరు నిరాశ చెందవద్దని ఎమ్మెల్యే రవికుమార్ హామీ ఇచ్చారు కూటమి ప్రభుత్వం వచ్చిన మరుసటి రోజు నుండే వృద్ధులుకి 4000, వికలాంగులకు 6000, శాశ్వత వికలాంగులకు 15000 రూపాయలు ఇస్తున్నాం అని తెలిపారు. కార్యక్రమంలో మార్క్ఫెడ్ డైరెక్టర్ శ్రీ ఆనెపు రామకృష్ణ నాయుడు , మాజీ ఎమ్మెల్సీ శ్రీ పీరుకట్ల విశ్వప్రసాద్ గా సర్పంచ్ ప్రతినిధి హనుమంతు గోపి మాస్టర్ ,స్థానిక కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు , గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ గ్రామం లో పెన్షన్ అందుకున్న వృద్ధులు, మహిళలు ఎమ్మెల్యే కి కూటమి ప్రభుత్వానికి ,గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు.
Admin
DNB News